స్నేహిత ఎక్స్ ప్రెస్: చెప్పుల ధర రూ.23 కోట్లు
అమెరికాకు చెందిన నటి, గాయకురాలు జూడి గర్లాండ్ ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ చిత్రంలో ధరించిన రుబీ చెప్పులను తాజాగా వేలం వేశారు. ఇవి ఏకంగా 28 మిలియన్ డాలర్లు (రూ.23 కోట్లకు పైగా) పలికాయి. దాదాపు 20 ఏళ్ల క్రితం చోరీకి గురైన ఆ చెప్పులు తాజా వేలంలో అంత ధర పలకడం విశేషం. మిన్నెసోటాలోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన ఈ చెప్పులు 2005లో చోరీకి గురయ్యాయి. ఎఫ్బీఐ అధికారులు దర్యాప్తు చేపట్టి 2018లో వాటిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు.
Discover more from expresstelugudaily.com
Subscribe to get the latest posts sent to your email.